ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని కూకటివేళ్లతో కూల్చుతాననడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలమైన పునాదులతో ఎన్టీఆర్ నిర్మించారని అన్నారు. ఆ పార్టీని కూల్చాలని చూడటం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వల్ల కూడా కాలేదని అన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబునాయుడులు కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగట్టారని దాంతో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని చెప్పారు.

జగన్ కలలను కనడం మానేసి వాటి నుండి బయటకు రావాలని అన్నారు. 10 ఏళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబునాయుడును ప్రజలు నమ్మారని, ఇచ్చిన హామీలను ఒక్కో దానిని నెరవేర్చుకుంటూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు.

ఏటా 2200 మంది రైతులు గతంలో మరణించారని ఆ కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని గాలి ప్రశ్నించారు. మేఘమథనం, జట్రోపా మొక్కలు పెంపకం పేరుతో వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ నేతలు దిగమింగారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: