మనిషి ఏ పాపం చేసిన భయంతోనో, భక్తి తోనో గుడికి వెళ్లి మన మొక్కలు తీర్చుకుంటాం. అంటే దేవుడి సన్నిధి ఎంత ధైర్యంగా ఉంటామో అందరికీ తెలుసు. కానీ అదే దేవుడి సన్నిధిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద ఒక ప్రేమ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు.

ఈ దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోగా, కత్తి పోట్లకు గురైన యువతి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాళెంకు చెందిన ఓ విద్యార్థిని, మాచర్ల మండలం శ్రీరాంపురం తండాకు చెందిన అంజీనాయక్‌తో ప్రేమలో పడింది.

వీరి ప్రేమ కొంతకాలం సజావుగా సాగింది. భవిష్యత్ లో ఎలాంటి అవాంతరాలు రావద్దని భక్తితో ఈ జంట కోటప్పకొండపై దైవదర్శనానికి బుధవారం వెళ్లారు. అక్కడ దర్శనం ముంగిచుకుని తిరిగి కొండ మెట్ల మార్గంలో కాలినడకన వస్తుండగా, ఇద్దరు దుండగులు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. మమ్ముల్ని ఏం చేయొద్దు అని బతిమాలినా వారి కనికరంచలేదు.

ఇంతకీ వీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో వారిపై ఎందుకు దాడి చేశారో అన్ని ప్రశ్నే..? ఈ దాడిలో యువకుడు ప్రాణాలు విడిచాడు. యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఈ యువతి చిలకలూరిపేటలోని ఓ కాలేజీలో ఆమె డిప్లొమో చదువుతోంది. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: