ఈ రోజుతో ఫిబ్రవరి 26 సమంత టాలీవుడ్ లో ఐదవ యానివర్శరీ జరుపుకుంటోంది. దాంతో ఆమె చాలా ఎక్సైటింగ్ ఫీలవుతోంది. కరెక్టుగా ఐదు సంవత్సరాల క్రితం సమంత తొలి చిత్రం నాగ చైతన్య హీరో గా వచ్చిన ఏమి మాయ చేసావే రిలీజై విజయవంతంఅయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె తన కెరీర్ లో బెస్ట్ ఐదు చిత్రాలు గురించి చెప్పుకొచ్చింది. (2010)లో విడుదలైన ఈ చిత్రం సమంత కెరీర్ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది.

నాగచైతన్య తో ఆ తర్వాత ఆమె ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు చేసినా ఈ చిత్రమై తనకు ప్రత్యేకమైనది అని చెప్తోంది. (2011) లో వచ్చిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ కే కాక, దర్శకుడు శ్రీనువైట్లకు,సమంతకు కలిసి వచ్చింది. ఈచిత్రం ఘనవిజయంతో ఆమెకు వరసగా పెద్ద హీరోల సరసన ఆఫర్స్ వచ్చాయి. ఈగ

రాజమౌళి దర్శకత్వంలో (2012) లో వచ్చిన ఈ చిత్రంలో నాని హీరో. ఈ చిత్రం పెద్ద విజయం సాధించటమే కాద ప్రపంచవ్యాప్తంగా రిలైజై అన్ని చోట్లా హిట్ అయ్యి..ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అత్తారింటికి దారేది(2013) లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

చిత్రం ఘన విజయం సాధించి ఆమెను నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టింది. మనం(2014) లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీలను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: