భారత దేశంలో వివాహ సంబంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ దేశం వారైనా భారతీయ వివాహ ఔన్నత్యం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అందులోనూ భారత దేశ స్త్రీ పట్ల అంత్యంత గౌరవ స్థానం ఉంది. భారత స్త్రీ అంటే పుట్టినింటికి, మెట్టినింటికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని అందరూ చెబుతారు. ఇలాంటీది మహిళ అన్న పదానికే మచ్చ తెచ్చింది తన భర్త వేరు స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో తన స్నేహితులతో కలిసి భర్తను నమ్మించి చంపేసింది.

ఈ దారుణం దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రబియా అనే మహిళకు భర్త దిల్షాన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోవాల్సిన రబియాని అనుమానం పెనుభూతంలా వేధించడం మొదలుపెట్టింది.

దీంతో తన స్నేహితులతో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. ఘజియాబాద్‌కు చెందిన పోలీసులు గ్యాంగ్ నెహర్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేల రూపాయలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేసింది.

ప్రతి రోజు రాత్రి భోజనం చేసిన అనంతరం భార్య తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. పాపం ఇది తెలియన భర్త అమాయకంగా ఆ పాలు తాగేశాడు. అతడు నిద్రలోకి వెళ్లగానే తన స్నేహితురాలు, ఆమె భర్త, మరో కిరాయి హంతకుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపింది. అనంతరం అతడికి బురఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో వారు వాహనంలో పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులను, అతని భార్యను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: