హైదరాబాద్ లో ఒక ఆటోలో తరలిస్తున్న వెయ్యి రూపాయల నోట్ల విషయం కలకలంరేపుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల రూపాయాలు ఎవరివి అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. డీసీపీ ఆఫీసు ముందు రోడ్డుపై పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ నోట్లు దొరికాయి. ఆటో డ్రైవర్ పరారయ్యాడు. నాలుగు పెద్ద బాక్సులలో వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. దాదాపు వంద కట్టలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా. అయితే ఆ నోట్లు ఎవరివో తెలియలేదు. అవి నకిలీవా, నిజమైనవా అనేది కూడా తెలియవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: