బాలీవుడ్ లో అమితాబచన్ హోస్టెడ్ గా చేసిన కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవి షో ఒక రేంజ్ కి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఈ షో సూపర్ హిట్టయింది. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమితాబచన్ తప్పుకోవడం ఆ కార్యక్రమానికి షారూఖ్ ఖాన్ హోస్ట్ గా నిర్వహించారు.

కాని షారూఖ్ అంతగా రాణించలేక పోవడంతో ఈ షో ప్లాప్ దిశగా సాగింది. తిరిగి అమితాబ్ బచ్చన్ చేయడంతో పుంజుకుంది. ‘కౌన్ బనేగా కరోడ్ పతి' తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోలో నాగార్జున చేస్తున్నారు. ఇప్పటికే షో 2 సీజన్లు పూర్తి చేసుకుంది. కాని ఇక ముందు నాగార్జున ఈ షో చేయడం లేదని తెలిసింది. కారణం నాగార్జున సినిమా ప్రాజెక్టకు ఒప్పుకోవడంతో షెడ్యూల్ కుదరక ఈ షోనుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం..?

మీలో ఎవరు కోటీశ్వరుడు రెండో సీజన్ పూర్తి కావడంతో ఆయన తన తాజా మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన' షూటింగులో పాల్గొంటారు. దీని తర్వాత కార్తితో కలిసి ఓ సినిమా, తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. మరి ఈయన తీసుకున్న ఈ నిర్ణయంతో షో నిర్వహకులు కంగారు పడ్డారు. ఆల్ రెడీ మంచి రన్నింగ్ లో ఉన్న గేమ్ షో. ఇలాంటి హోస్ట్ ఎక్కడ దొరుకుతాడు. చక్కటి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తిలా అందరితో కలిసిపోయిన నాగార్జున అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు, యాజమాన్యానికి ఇబ్బంది కలిగించే విషయమే.

మరి ఈ కార్యక్రమాన్ని అంతగా విజయవంతం చేయగల ప్రతిభాశాలి తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నదే ప్రశ్న. గతంలో బాలీవుడ్ లో అలాంటి ప్రయోగాలు చేస్తే షో ప్లాపు దిశగా సాగింది మరి ఇక్కడా అలాంటి నిర్ణయమే తీసకుంటారా లేక నాగార్జుననే ఒప్పిస్తారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: