ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగడం అనేది పూర్వ జన్మ సుకృతమే.. ఎందుకంటే కష్ట సుఖాల్లో వారి ప్రేమ ఏ కష్టం రాకుండా కాపాడుతుంది. ఇలాంటి అదృష్ట వంతుడే మంచు మనోజ్ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఈ రోజు బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా మనోజ్ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇరువురి కుటుంబాల పెద్దలు హాజరు కాగా వేద బ్రహ్మనులతో మంత్రోచ్చారణల మధ్య ప్రణతి, మనోజ్ నిశ్చితార్థం జరిగింది. అంటే మనోడు సినిమాల్లో నే కాదు నిజ జీవితంలో కోరుకున్న అమ్మాయిని తన అర్ధాంగిగా చేసుకోబోతున్నాడన్న మాట.

ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆయన తల్లి విజయమ్మ విచ్చేశారు. రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, దాసరినారాయణ రావు, సుశీల్ కుమార్ షిండే, రాఘవేంద్ర రావు, చిరంజీవి, రాంచరణ్, సునీల్, జయప్రద, అలీ, నందూ, గీతామాధురి,శివబాలాజీ దంపతులు, బ్రహ్మాజీ,బ్రహ్మానందం, కోడీరామకృష్ణ, నిశ్చితార్థ నికి సినీ ఇండస్ట్రీ పెద్దలు, మంచు ఫ్యామిలీ సన్నిహితులు, రాజకీయ విచ్చేసి మంచు వారి అబ్బాయిని ఆశీర్వదించారు.

మంచు మనోజ్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. మే 20 ఉద‌యం 9.10 ని.ల‌కు మ‌నోజ్ - ప్ర‌ణ‌తిల పెళ్లి జ‌రిపించాల‌ని ఇరు కుటుంబాల వాళ్లు నిర్ణ‌యించుకొన్నారు. ప్ర‌స్తుతం మ‌నోజ్ ఎటాక్ చిత్రంలో న‌టిస్తున్నాడు. రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ త‌ర‌వాత జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: