దేశంలో కామాందులు రోజు రోజు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక న్యూస్ అబలలు బలి అవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకు వచ్చినా బేఖాతరు చేస్తూ నిర్లజ్జగా బరితెగిస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ప్రఖ్యాత లాల్ బాగ్ బోటానికల్ గార్డెన్స్ సమీపంలోని మార్కెట్ దగ్గర 21 సంవత్సరాల మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది. గత వారం మహిళ కుటుంబ సభ్యులు సోంత పనులపై ఊరికి వెళ్లారు.

బుర్కాలు ధరించి ఇద్దరు వ్యక్తులు మహిళ ఇంట్లో దూరి పంజాబీ డ్రెస్ చున్నీతో కాళ్లూ చేతులు కట్టేసి పైశాచికంగా అత్యాచారం చేశారు. ఎదురు తిరిగితే చంపేస్తామని బెధిరించారు. ఈ విషయం ఫిబ్రవరి 26 వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలకు పంపించారు. మహిళ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న వారు ఎవరైనా అత్యాచారం చేశారా, పాత కక్షల కారణంగా అత్యాచారం చేశారా అని ఆరా తీస్తున్నామని బుధవారం సిద్దాపుర పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: