హైదరాబాద్ మహానగరం ఎవరి పనులు వారికి ఉంటాయి బీజీ బిజీ లైఫ్.. అందరూ చూస్తుండగా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యే సంఘటన. ఓ వ్యక్తి చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన హైదరాబాద్ లోని చందానగర్, లింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. అక్కడి ఉద్యోగులు అందించిన సమాచారం మేరకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకటరెడ్డి (30).

వెంకట్ రెడ్డి గచ్చిబౌలి లోని డీఎస్ టీ వరల్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వెంకటరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరు మణికొండలో నివాసం ఉంటున్నారు. వెంకట్ రెడ్డి ఆఫీసులు చాలా చలాకీగా ఉండేవాడని ఎలాంటి సమస్యలు కూడా లేవని సహ ఉద్యోగులు చెప్పారు.

అయితే వెంకటరెడ్డి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే విషయం తెలియలేదని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: