ఒక వైపు నిర్భయ కేసు నిందితుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుంటే ఇది తప్పూ అని ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. రోజు రోజు పెచ్చు మీరుతున్న మహిళలపై, యువతులపై,మైనర్ బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

లోపం ఎక్కడుందో ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.. అత్యాచార నిందితులను పట్టుకున్నాం వారిని కఠినంగా శిక్షిస్తాం అని చట్టం తన పని తాను చేసుకు పోతుందే తప్ప ఇప్పటి వరకు గట్టి చర్య తీసుకోలేదు. తాజాగా కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దీనబంధు కాలనీలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.

మద్యం మత్తులో ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒకడు పరారీలో ఉన్నాడని ఆ నిందితున్ని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: