మహిళలపై రోజు రోజు కు పెరుగుతున్న అక్రమాలు, అన్యాయాల గురించి ఏకరువు పెట్టి చెప్పినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఆడది కనబడితే చాలు చిత్తకార్తె కుక్కలా మీద పడిపోయి పాడు చేయాలని చూసే మగరాయుళ్లకు ఈ న్యూస్ చదివితే వామ్మో అనిపిస్తుంది.

అవును అక్కడి వారు తమ తోటి మహిళకు జరిగిన అన్యాయానికి చట్టాన్ని,న్యాయాన్ని నమ్మలేదు దేవుడు శాసించాడు మేం పాటిస్తున్నాం అన్న చందంగా అత్యాచారం చేసిన బాధితున్ని కొట్టి కొట్టి మరీ చంపారు. వివరాల్లోకి వెళితే .. నాగాలాండ్ లోని దీమాపూర్ గ్రామంలో ఓ మహిళపై రెండు రోజులుగా సయ్యత్ ఫరీద్ ఖాన్ (35) అఘాయిత్యానికి పాల్పడూతూ పైశాచిక ఆనందం వెళ్లదీశాడు.

సదరు బాధితురాలు మొత్తానికి బయట పడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షరామాములుగానే నిందితున్ని పోలీసులు జైల్లో పెట్టారు. రేప్ చేసిన వాడు హాయిగా జైల్లో రెస్టు తీసుకోవడం దిమాపూర్ గ్రామస్తులకు నచ్చలేదు అంతే జైలు గోడలు బద్దలు కొట్టి నిందితున్ని బయటకు తీసుకువచ్చారు.

రోడ్డుపై కొట్టుకుంటూ గ్రామానికి తీసుకు వచ్చారు. అంతే ఆ దెబ్బలకు తాళలేక నిందితుడు చనిపోయాడు. ఇదండీ చట్టం, న్యాయం నింధితులకు వెంటనే శిక్ష ఖరారు చేయడం లేదని రగిలిపోయిన గ్రామస్తులు ఇలా నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: