మనం మరణించినా పది కాలాల పాటు మన పేరు తల్చుకొనేలా మంచి పని చేయాలి. అందరూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకుంటుంటే అనుకోకుండా ఆ కుటుంబంలో పెద్ద మరణించాడు. దీంతో ఆ ఇంట విషాదఛ్చాయలు నిండినా గుండె నిర్భరం చేసుకొని బ్రెయిన్ డెడ్ అయిన తమ ఆత్మీయుడి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది.

విషయానికి వస్తే.. రెండు రోజులు క్రితం విజయవాడలో ఓ యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ యాక్సిడెంట్ లో కారు డ్రైవర్ మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆస్పత్రి కి తరలించారు. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

మనిషి బతికినా చచ్చిన శవంలా తయారయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు చాలా ఆవేదన చెందారు. కానీ అదృష్టమో దేవుడి దీవెనలో కానీ అతని గుండె, లివర్, కాలేయం, కళ్లు, కిడ్నీలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.

చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆ యువకుడి గుండెను అమర్చనున్నారు. మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ ఆసుపత్రినుండి మధ్యాహ్నం రెండుగంటలకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ లో చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: