ఐ డోన్ట్ కేర్ అని అంటూ ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్, తేదేపాలను ఆంధ్రా పార్టీలుగా అభివర్ణించిన కేసిఆర్ ఇప్పుడు వారి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి తెరాస శ్రేణులను భయపడకండి అని హితభోద చేస్తున్నాడు. షర్మిల యాత్ర ఇంకా తెలంగాణాలో మొదలవ్వక పోయిన ఎలాగూ త్వరలోనే రాక మానదుగా అన్నట్లు ఉంది కేసిఆర్ మనోగతం. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అసలు ఈ ప్రాంతంలోకి వచ్చే అవకాశమే లేక పోవడంతో వెనకబడి ఉన్న తెదేపా, జగన్ కు చెందిన కొత్త పార్టీ ఇప్పుడు కాస్త పరవాలేదని అనిపించుకున్టున్నాయి. పాలమూరులో యాత్ర చేపట్టడమే కాకుండా దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బాబుని చూసి చంద్ర శేఖర్ రావు గారికి మెల్లగా వణుకు పుట్టినట్లుoది, ఎక్కడ తమ పార్టీలోకి వచ్చిన తెదేపా కార్యకర్తలు మళ్లీ ఎక్కడ స్వగృహ ప్రవేశం చేస్తారేమోనని . అందుకే భయపడకండి నేనున్నాని అంటున్నారు కేసిఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: