తన కూతురి పెళ్ళికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి కాస్త వేదాంతంగా మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంభందించి ఢిల్లీ నుండి వస్తున్న ఊహాగానాలకు సమాధానమిస్తూ బొత్స ఈ సారి తన సహజ శైలికి కాస్త భిన్నంగా మాట్లాడారు. అంతా అమ్మ (సోనియా) చేతిలో ఉందని ఆమె ఎలా అదేశిస్తే అలా జరుగుతుందని, అమ్మ ఇచ్చింది అమ్మే తీసుకుంటుందని అని అన్నాడు. ఎంత ప్రయత్నించినా సొంత పార్టీ నుండి ,ప్రతిపక్షాలు నుండి ఎప్పుడూ విమర్శలు ఎదుర్కుంటున్న బొత్స కనీసం అధిష్టానాన్ని కూడా మచ్చిక చేసుకోలేక పోయాడని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో సత్తి బాబు కాస్త కుదుటపదతాడా లేక తట్ట బేడా సర్డుకోవల్సిన్దేనా అని!

మరింత సమాచారం తెలుసుకోండి: