ఇది అన్నది సాక్షాత్తు మన దేశ హోం శాఖా మంత్రి సుషీల్ కుమార్ షిండే. అన్న సందర్భం మాత్రం తెలంగాణా విషయంలో. ఇన్నేళ్ళు ఆగారుగా ఇంకొన్ని నెలలు ఓపిక పట్టండి అని మంత్రి సెలవిచ్చారు. తెలంగాణా మీద ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని , అంత త్వరగా తేల్చలేమని కూడా షిండే అన్నారు.  అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఇది ఎప్పుడన్నా జరగొచ్చన్నారు. ఇన్నాళ్ళు పండుగలు,పబ్బాలు,ఎన్నికల పేరుతో కాలయాపన చేసిన కేంద్రం ఈ సారి ఏకంగా నెలలు అని అనడంతో మన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తల గోక్కుంటున్నారు. ఇప్పటికే నరసింహావతారం ఎత్తుతానన్న కేసిఆర్ ఏమంటాడో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: