సినీనటి రోజా.. టీడీపీలో ఉన్నప్పటి కంటే వైసీపీలో ఉన్నప్పుడు మహా యాక్టివ్ అయ్యింది. నగరి నుంచి గెలిచింది వెయ్యి ఓట్ల కంటే తక్కువ మెజారిటీయే అయినా.. తానో ఎమ్మెల్యే అన్నఆనందం ఆమెకు చాలా కిక్ ఇస్తున్నట్టుంది. సినీ ఫీల్డులో ఉన్న నటనానుభవానికి.. జబర్దస్త్ వంటి షోల పంచ్ లు అలవాటై అసెంబ్లీలో యమా దూకుడు ప్రదర్శిస్తోంది. 

జగన్ వ్యూహాత్మకంగానే

జగన్ కూడా రోజూకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ.. ప్రోత్సహిస్తున్నారు. ఐతే.. జగన్ వ్యూహాత్మకంగానే రోజానూ ముందుకు నెట్టి టీడీపీతో యుద్ధం చేస్తున్నారన్న వాదన కొత్తగా వినిపిస్తోంది. పాపం ఆడబిడ్డను టీడీపీపైకి ఉసిగొల్పుతూ తన పబ్బం గడుపుకుంటున్నారని కొందరు టీడీపీ నాయకులు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వీరి వాదనలోనూ కాస్తో కూస్తో వాస్తవం ఉంది.


రోజా ఇప్పుడు అనేక పోలీస్ కేసులు


ఎందుకంటే.. దళిత మంత్రిపై చేసిన వ్యాఖ్యల మూలంగా రోజా ఇప్పుడు అనేక పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి, కర్నూలు వంటి అనేక జిల్లాల్లో రోజాపై టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు కేసులు పెట్టారు. ఇలాంటి రొటీన్ గా జరిగేవే అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఒక వేళ వారు పెట్టింది అట్రాసిటీ కేసయితే ఫలితం ఇబ్బందికరంగా ఉంటుంది.

రోజాపై పీకలదాకా కోపంతో ఉన్న టీడీపీ


అసలే రోజాపై పీకలదాకా కోపంతో ఉన్న టీడీపీ ఈ కేసులను అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టే అవకాశమూ లేకపోలేదు. తాజాగా కర్నూలు పోలీస్ స్టేషన్లో రోజాపై కేసు పెట్టిన టీడీపీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. జగన్ రోజా జీవితంతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రోజా కూడా అసెంబ్లీని సినిమా అనుకుంటున్నారని.. ఇకనైనా రోజా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: