విజయం మనదే !


భారత్ Vs  ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ విషయంలో క్రికెట్ అభిమానులు సరైన అంచనా వేశారు. అరోన్ ఫించ్ 79 పరుగులు చేసిన సందర్భంలో ఫించ్ సెంచరీ కొడతాడా అంటూ సాక్షి.. ఫేస్ బుక్ ద్వారా క్రికెట్ అభిమానులు ప్రశ్నించగా.. అతడు సెంచరీ చేయలేడని.. 80 నుంచి 90 పరుగుల మధ్యే అవుటవుతాడని చెప్పారు. వారు చెప్పినట్లుగానే 81 పరుగులు చేసి పించ్ పెవిలియన్ బాటపట్టాడు. ఇంకొందరు ఇదే ప్రశ్నకు స్పందిస్తూ ఎవరొచ్చి ఎన్ని సెంచరీలు కొట్టినా గెలుపు మాత్రం ధోని సేనదేనని  చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయి 248 పరుగులతో క్రీజులో ఉంది.(source)

మరింత సమాచారం తెలుసుకోండి: