భారత దేశంలో మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతుంది. మగాళ్లు మృగాళ్ల ల రెచ్చిపోతున్నారు. స్త్రీ ఎక్కడా స్వేచ్చగా తిరగలేక పోతుంది. ఎక్కడ చూసినా ఎక్కడో అక్కడ మహిళలపైన, యువతులపైన,చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వార్తల్లో చదువుతూనే ఉన్నాం. తాజాగా జరిగిన సంఘటనలో భర్త కాలయముడైనాడు మనసా వాచా కర్మేనా ఎడడుగుల బంధాన్ని మంట కలిపాడు. భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా బలవంతంగా విషం తాగించి మరీ చంపాడు.

ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది.  ఈ గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. ముక్తేశ్వరరావు తాగుబోతు కావడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తుండేవి. ఈ గొవడలు కాస్త ముదిరి నర్సమ్మను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు అంతటితో ఆగకుండా విషం నోట్లో బలవంతగగా పోశాడు.   కొన ఊపిరితో ఉన్న నర్సమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. దీంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బంధువులు ముక్తేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: