గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నిర్వహిస్తున్న నరేంద్ర మోడీకి ఇప్పుడు ఓ కొత్త కష్టం వచ్చి పడింది. మోడీ ముఖాన్ని చూసి జనాలు భయపడిపోతున్నారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన మోడీ మాస్కులను చూసి మోడీతో సహా నేతలు, ప్రజలు కూడా భయపడిపోతున్నారు. దీంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2007లో గుజరాత్ ఎన్నికల ప్రచారంలోనూ అంతటా మోడీ మాస్కులను సిద్ధం చేశారు. ప్రచారానికి వచ్చిన నేతలంతా వీటిని ధరించడంతో ఆయనకు ప్రచారం లభించింది. ఎన్నికల్లో కూడా ఈ మాస్కు మంత్రం బాగా పని చేసింది. సింగపూర్ కు చెందిన ఓ కంపెనీ అచ్చం మోడీ నడిచివచ్చినట్లుగా ఈ మాస్కులను ఆకర్షణీయంగా తయారు చేసింది. ఈ మాస్కు మంత్రం బాగా పని చేసి మోడీ విజయానికి కూడా కారణమైంది. గత ఎన్నికల్లో పని చేసిన మోడీ మాస్కు మంత్రాన్ని ఈసారి కూడా ప్రయోగించిన బీజేపీ శ్రేణులకు ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈసారి తయారు చేసిన మోడీ మాస్క్ లు ఏమాత్రం ఆకర్షణీయంగా లేకపోవడంతో పాటు... చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నాయని ఆపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. దీంతో ప్రచారం కోసం లక్షలాదిగా తయారు చేయించిన మాస్కులు పార్టీ ఆఫీసులోనే ఓ మూలకు పడేశారు. ఇది ఎన్నికల ప్రచారంలోనే ఎదురుదెబ్బ తగిలిందా అని పార్టీనేతలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: