రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ సర్కారు కష్ట నష్టాల్లో ఉందంటూ కేంద్రానికి ఏకరువు పెడుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా సరే నాయకుల మనసు తృప్తి పరిచే పని చేసింది ఏపీ సర్కార్. చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏపీ ప్రభుత్వం ఆపిల్ ఐ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. ఏటా బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.


రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం దృశ్యం


మరి టెక్నాలజీ ముందుకు పోతుంది మనం కూడా దానికి తగ్గట్టుగా పోవాలి అన్న సందేశంతోనో లేక బాబు ఇమేజ్ కాపాడుకోవడం కోసమే కాని మంచి బహుతులే ఇచ్చాడు. ఈసారి ఐ ఫోన్లను అందించారు. ఇందుకోసం దాదాపు రూ. కోటిన్నరపైగా ఖర్చు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీటీడీ ప్రసాదాలను కూడా అందజేశారు. ఇక తెలంగాణ విషయంలోకి వస్తే చంద్రబాబు ఒకటి చేస్తే చంద్ర శేఖర్ రావు రెండు చేస్తారు.. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు  తెలంగాణ రాష్ట్రం   నాయకులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎలాంటి బహుమతులు ఇస్తారో వెచిచూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: