శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో ఓ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉండడం గమనార్హం. బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ ప్రభు ఆల్కహాల్ సేవించినట్టు తేలడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మొత్తం 30 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 15 కార్లు, 20 బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: