ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తున్న సందర్భంగా సూర్యాపేటలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రజాజీవనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సిపిఎం నాయకులను సైతం ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వీరభద్రం నిరసించారు. నాయకులు, మంత్రుల పర్యటనల సందర్భంగా పోలీసులు భద్రత పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, భయభ్రాంతులకు గురి చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. సిఎం కాసేపు సూర్యాపేటలో బసచేయడంతో బందోబస్తు పేరిట మెడికల్ షాప్‌లతోపాటు అన్నింటినీ మూయించారని, ట్రాఫిక్‌ను మళ్లించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, హాస్పటళ్లను కూడా మూసివేశారని అన్నారు. దీంతో రోజువారీ వ్యాపారాలు దెబ్బతినడంతో పాటు పండగ సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణీకులు నానా అగచాట్లు పడ్డారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: