ఎక్కడి నుంచో గుజరాత్‌కు వచ్చిన ఓ పావురం భద్రతా సిబ్బందికి గుబులు పుట్టిస్తుంది. గుజరాత్ పోలీసులు, తీర గస్తీ దళం, అటవీ శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, చివరికీ కేంద్ర హోం శాఖ కూడా పావురం గురించి అంతు బట్టక తల గోక్కుంటున్నారు. గత వారం సలాయా తీరంలోని దేవ్‌భూమీ ద్వారకలోని ఎస్సార్ జెట్టీ నిర్మాణ ప్రాంతంలో ఓ పావురం అక్కడి సెక్యూరిటీ గార్డు చేతికి చిక్కింది. పక్షి పాదానికి చిప్, మరో పాదానికి ఉంచిన రింగ్‌పై 28733 అను అంకెలుండటం, దాని రెక్కలపై అరబిక్, ఉర్దూలో రాతలను అతను గమనించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: