మా ఎన్నికల పుణ్యమా అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కాంట్రావర్సీ అయ్యింది. సహజంగా కాస్త వ్యంగ్యంగా మాట్లాడే హేమ.. ఈ ఎన్నికల విషయానికి వచ్చేసరిగా బాగానే రెచ్చిపోయింది. 
అందులోనూ తనపై ఆపోజిట్ ప్యానల్ వాళ్లు అసభ్యంగా మాట్లాడటంతో ఆమె కోపం రెట్టింపైంది. 

ఉదయం ఓటేసేందుకు ఫిలింఛాంబర్ వద్దకు వచ్చిన ఉమ.. మీడియా సాక్షిగా ప్రత్యర్థులపై విరుచుకుపడింది. తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేసిన శివాజీరాజాను దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసింది. మా ఇంటి గొడవను టీవీల కెక్కి ఎందుకు తలవంపులు తెచ్చారని నిలదీసింది. 

ఏ ఛానల్లోనైనా చర్చకు సిద్దమన్న హేమాంటీ.. అక్కడే తేల్చుకుందామని.. తనదే తప్పని రుజువైతే.. అక్కడే లైవ్ లో కాళ్లుపట్టుకుని క్షమాపణ చెబుతానని తెగేసి చెప్పింది. అంతేకాదు.. శివాజీ రాజా తన తల్లిదండ్రులను సరిగ్గా చూడటం లేదన్న సంగతిని మరోసారి ప్రస్తావించిన ఆమె.. ఏం అది నిజం కాదా అని ప్రశ్నించింది.

అంతే కాదు.. శివాజీరాజా క్యారెక్టర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన గురించి అసభ్యంగా మాట్లాడిన శివాజీరాజా తనకు సారీ చెబుతాడని తాను ఆశించడం లేదని.. శివాజీరాజాకు అంత సంస్కారం ఉంటుందని తాను ఆశించడం లేదని సెటైర్ వేసింది.

తమ పంచాయితీని దాసరి నారాయణ ముందు ఉంచామని.. పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానని హేమ చెప్పుకొచ్చింది.  సినీపరిశ్రమలో తానో కరివేపాకునని తనని తాను వర్ణించుకుంటూనే.. తన గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదని చివర్లో ముక్తాయింపు ఇచ్చింది. ఇష్యూ ఇంతటితో వదిలేద్దామని చివర్లో నీతి వాక్యాలు కూడా చెప్పిందండోయ్..


మరింత సమాచారం తెలుసుకోండి: