ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిపై విమర్శలు చేశారు.పట్టిసీమపై సాక్షి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.పట్టిసీమ నీళ్లు తీసుకు వెళ్లి ఎక్కడ నిల్వ చేస్తారని ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని ఆయన అన్నారు.రాయలసీమ, గుంటూరు ప్రాంతాలలో నిల్వ ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు.తప్పులు చేసి వేల కోట్ల రూపాయల ఆరోపణలు ఎదుర్కంటున్నారని, వారి ఆస్తులు జప్తు అవుతున్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు సాక్షిపై విమర్శలు

పట్టిసీమపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.ఇతర రాష్ట్రాలకు కూడా పట్టిసీమపై హక్కులు ఉండవని అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 మీటర్ల నీరు పైన ఉంటేనే ఇక్కడ నుంచి నీటిని తరలిస్తామని ఆయన అన్నారు.జగన్ పై ఆరోపణలకు,పట్టిసీమ నీటి ని ఎక్కడ నిల్వ చేస్తారన్నదానికి సమాధానం అవుతుందా?సాక్షి ప్రశ్నకు జవాబు ఇచ్చినట్లేనా?

సాక్షి ప్రశ్నకు బాబు జవాబు


మరింత సమాచారం తెలుసుకోండి: