మొబైల్ ద్వారా వాణిజ్య లావాదేవీలు
అంతేకాదు గత రెండు సంవత్సరాల్లో శరవేగంగా వృద్ధి చెందిన మొబైల్ యాప్ మార్కెట్ భారతేనట. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్ల డౌన్లోడింగ్లో ఇండియా వాటా 7 శాతం. ఈ విషయంలో ఇండోనేషియా, చైనా, అమెరికా తర్వాత నాలుగో స్థానం ఇండియాదే. గతేడాది మొబైల్ ద్వారా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకున్న భారతీయుల సంఖ్య ఏకంగా 33 శాతం పెరిగి 17.3 కోట్లకు చేరుకుంది. మొబైల్ నెటిజన్ల సంఖ్య ఏటా 21 శాతం వృద్ధి చెంది 2019 నాటికి 45.7 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ఈ తరుణంలో ఈ-కామర్స్ సంస్థలు కూడా మొబైల్ యాప్ల ద్వారా సేవలందించడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయని కేపీఎంజీ రిపోర్టు పేర్కొంది. అయితే మొబైల్ వినియోగదారులు కేవలం ఉచిత యాప్లను డౌన్లోడ్ చేసుకునేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపింది. మొత్తం డౌన్లోడ్లలో ఉచిత యాప్ల వాటా 90 శాతమని అంటున్నది.