ప్రతి రోజు మక కళ్ల ముందు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఇవి మరీ దారుణమయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు మహిళలపై, యువతులపై రేపిస్టులు అత్యాచారాలు జరుపుతూనే ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి వీటికి కట్టడి చేసేది ఎవరు అంటే సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది కానీ మహిళలపై అత్యాచారాలు రూపు మాపే దిశవైపు ఏవీ సాగడం లేదు.

తాజాగా పెద్ద చదువులు చదువుకొని ప్రయోజకురాలయ్యి తన కుటుంబానికి సహాయంగా ఉండాలని తలిచింది ఓ అభాగ్యురాలు.   చదువులో రాణిస్తూ ఐఐటి లో ర్యాంక్ సాధించాలని వచ్చిన 17 ఏళ్ల అమ్మాయి ఆశలను నీరు గార్చడమే కాకుండా ఆమెను కోలుకోని రీతిలో దెబ్బ తీసిన వైనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆమె ఉంటున్న హాస్టల్ యజమాని 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను నగ్నంగా చిత్రీకరించి, నెలల తరబడిగా బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలు రాజ్ ఘడ్ కు చెందిన అమ్మాయి. ఐఐటి కోచింగ్ కోసం 2014 మేలో భోపాల్ వచ్చింది. గౌతం నగర్లోని హాస్టల్లో ఉంటూ వచ్చింది.

ఒక రోజు తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి కేక్ కొనాలని యువతికి మాయ మాటలు చెప్పి తన రూమ్ కి తీసుకెళ్లాడు. కూల్ డ్రింగ్ లో మత్తు మందు కలిపి యువతి ఆపస్మారక స్థతిలో ఉండగా ఆమెను రేప్ చేసి నగ్నంగా వీడియో, ఫోటోలు తీశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా 50వేల రూపాయలు ఆమె నుంచి లాగడానికి ప్రయత్నించాడు. ఈ బాధ కొంత కాలం భరించిన ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే భోపాల్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతన్ని పట్టుకుని వీడియో క్లిప్ను స్వాధీనం చేసుకుంటామని పోలాసులు వెల్లడించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: