తూర్పుగోదావరి జిల్లా జనుపల్లికి చెందిన 27 ఏళ్ల అనూష.. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సోమాజిగూడలో వుంటుంది. రీసెంట్గా ఆమెకు ఈనెల 8న రాజమండ్రి ప్రాంతానికి చెందిన అర్జున్తో వివాహమైంది. ఆయన బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. మ్యారేజ్ తర్వాత అనూష సోమాజిగూడలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుంటోంది. గతవారం నుంచి డ్యూటీకి వెళ్తోంది. ఆదివారం సాయంత్రం ముషీరాబాద్లో తన కజిన్బ్రదర్ వద్దకు వెళ్లిన అనూష, రాత్రి 10 గంటల సమయంలో తిరిగి హాస్టల్కు వచ్చేసింది.
నిద్రపోయే ముందు హాస్టల్లో పనిచేసే ఆయమ్మను పాలు అడిగి తాగింది కూడా! సోమవారం ఉదయం అనూష ఎంత లేపినా లేవలేదు.. అప్పటికే ఆమె నోటి నుంచి నురగలు కనిపిస్తున్నాయి. వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికే మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. నోటిలో నురగల్ని బట్టి అనూష విషం తీసుకుందా..? విషం ఇచ్చి ఈమెను చంపేశారా ఇలా అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మరోవైపు అనూష గదిలో వుండే ఫ్రెండ్ హర్షిత షిర్డీ వెళ్లి సోమవారం ఉదయం నగరానికి వచ్చింది. ఈలోగా అనూష మరణించడంపై అసలు ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. మరి పోస్టుమార్టం రిపోర్టులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.