తెలంగాణ పోరాటంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్సు వాడ నుంచి పోచారం శ్రీనివాస్ ఎంతటి పోరాట పటిమ చూపించారో అందిరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర అవతర తర్వాత కేసీఆర్ రాజకీయ రంగంలో పోరాటం చేసిన వారికి సముచిత స్థానం కల్పించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు.


సాధారణ పరీక్షలో కోసం కేర్‌ ఆస్పత్రికి వెళ్లిన ఆయన్ను ఆస్పత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలను గుర్తించి వైద్యులు చికిత్స అవసరమని వెల్లడించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. డా.సోమరాజు నేతృత్వంలోని వైద్య బృందం మంత్రిని పర్యవేక్షిస్తోంది. ఈయన ఆరోగ్య పరిస్థతి పూర్తిగా మెరుగు పడిన తర్వాత ఆస్పత్రినుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: