హైదరాబాద్ లో రోజు రోజుకి దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేరగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. నిన్న జ్యోతిష్యుడిపై కాల్పులు జరిపిన వార్త మరవక ముందే సికింద్రాబాద్‌లో బుధవారం అర్థరాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.


 బాటా షోరూం వద్ద ఫుట్ పాత్‑పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్‑పై పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మహంకాళీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   అయితే ఒకే సారి ఇద్దరిపై వేరు వేరు చోట్ల పెట్రల్ పోసి నిప్పంటిచడం తీవ్ర కలకలం రేపుతుంది. అంతే కాదు ఈ రెండు ఘటనలు ఒకేలా జరగడంతో గాయపడిన ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందినవారా? పథకం ప్రకారమే ఇలా చేశారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: