యాదగిరిగుట్.. నారసింహుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. తెలంగాణకే తలమానికమైన పుణ్యక్షేత్రం. ఈ దివ్యధామాన్ని తిరుమలకు పోటీగా అభివృద్ది చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. నిరంతరం అభివృద్ధి పనులు సమీక్ష చేస్తూ.. నిధులు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. 

కొందరు కామాంధులు మాత్రం యాదగిరిగుట్టను వ్యభిచారానికి వేదికగా వాడుకుంటున్నారు. భక్తి ముసుగులో భక్తుల్లా వచ్చి.. లాడ్జీల్లో రూములు తీసుకుని రొమాన్సు చేస్తూ.. చెడ్డపేరు తెస్తున్నారు. కామలీల్లో మునిగితేలుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. 

శుక్రవారం పోలీసులు యాదగిరిగుట్ట లాడ్డీల్లో జరిపిన దాడుల్లో 11 మంది జంటలు దొరికిపోయారు. వీళ్లంతా యువతీ యువకులే కావడం గమనార్హం. తప్పుడు చిరునామాతో లాడ్జీల్లో గదులు తీసుకున్న జంటలను పోలీసులు విచారించారు. 

వారి నుంచి సరైన సమాచారం లేకపోవటంతో ఈ కుర్ర జంటలను అదుపులోకి  తీసుకొని కోర్టులో హాజరుపరుచారు. పవిత్ర పుణ్యక్షేత్రాని ఇలా అపవిత్రం చేయవద్దని యాదగిరిగుట్ట ఎస్సై రాజశేఖర్ రెడ్డి కుర్రాళ్లను కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: