మూవీ కళాకారుల సంఘం ఎన్నికలలో ఓడిపోయిన ప్రముఖ నటి జయసుధ ఘాటుగానే వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికలలో మరో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైన నేపధ్యంలో ఆమె మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ ఎన్నికలలో గెలిచిన తర్వాత కూడా డిగ్నిటిగా వ్యవహరించడం లేదని అన్నారు.రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ అని, కాకపోతే ఎన్నికలలో గెలిచాక కూడా అదే మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. ఎన్నికలు అయ్యాక ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ,అది పద్దతి కాదని జయసుధ పేర్కొన్నారు.రాజేంద్ర ప్రసాద్ ను అభినందించాలని అనుకున్నానని,కాని ఆయన ఆ తర్వాత చేసిన ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.అయినా తనకు 150 ఓట్లు రాగా, తన పానెల్ లో ని వారు 22 మంది గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదని ఆమె అన్నారు.తాను సంఘ కార్యక్రమాలలో పాల్గొనని ఆమె స్పష్టం చేశారు.తానెప్పుడు అభ్యంతరకరంగా మాట్లాడలేదని ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: