కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఒకటో నగర పోలీసుల కథనం మేరకు ఈ నెల 14న నగరంలోని ఇందిరా భవన్ రికార్డుల విషయమై ఇందిరాభవన్ ఇన్‌చార్జి బాలసుధాకర్‌తో గొడవపడి అతన్ని కులం పేరుతో దూషించారు. ఈమేరకు ఆయన శనివారం ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం ఆనం వివేకానందరెడ్డి, అతనితోపాటు ఇందిరా భవన్‌కు వెళ్లి గొడవకు దిగి కులం పేరుతో దూషించారన్న అభియోగంపై ఆయన అనుచరులైన షఫీ, శివాచారి, వేణుగోపాల స్వామి దేవస్థానం ఉద్యోగి రాజుపై ఒకటో నగర పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: