గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలతో అట్టుడికి పోయిన మా ఎలక్షన్స్ ల్లో చివరకు విజయం నటకిరీటికే దక్కింది. ఈ సందర్భంగా ఈ గెలుపు నాది కాదని తనను గెలిపించి ప్రతి ఒక్కరికీ గెలుపు అంకితం చేస్తున్నాని అన్నారు. సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ కలుసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ 'మా' అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ సీఎంతో సమావేశమయ్యారు.


కేసీఆర్ తో మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్


 తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో చొరవ చూపిస్తున్నారని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాజేంద్రప్రసాద్ కు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: