సినీనటులు.. అభిమానులతో కలవడం మామూలుగా సాగేదే.. అందులో పెద్ద చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఫ్యాన్స్ తో ఫోటోలు దిగడం.. పలకరించడం సాధారణమే.. కానీ.. పవన్ - శ్రీజ పరామర్శ ఎందుకంత సెన్సేషన్ అయ్యింది. ఇది కేవలం ఓ సాధారణ పలకరింపేనా..? 

కానేకాదంటున్నారు పవన్ ఫ్యాన్స్. అభిమానులు హర్టవుతారని.. వాళ్లను సంతృప్తి పరచడానికి సెలబ్రస్ ఎన్నో హామీలిస్తారు. కానీ వాటిని మరచిపోతుంటారు. కానీ పవన్ శ్రీజ విషయంలో చూపిన శ్రద్ధ అభిమానులను హృదయాలను ఆకట్టుకుంటోంది. పవన్ పై గౌరవం పదింతలు చేసింది. 

అభిమాని కోరింది.. వెళ్లి చూసి వచ్చాం.. అంతటితో అయిపోందనుకోలేదు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూనే ఉన్నారు. తాను సాధారణస్థితికి చేరుకుందని తెలియగానే హైదరాబాద్ ఆహ్వానించాడు. 

ఓ సాధారణ అభిమానితో పవన్ రెండు గంటలు గడిపాడు. సాధారణంగా ఇలాంటి పలకరింపులు ఓ పావుగంటలో అయిపోతుంటాయి. నాలుగు ఫోటోలు క్లిక్ అవగానే పంపించేస్తుంటారు. కానీ పవన్ అలా కాదు.. వాళ్ల క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. దాదాపు రెండు గంటలపాటు గడిపాడు.. ఓపిగ్గా అందరితో ఫోటోలు దిగాడు. 

పవన్ వీడ్కోలు పలికిన తీరు కూడా శ్రీజ కుటుంబీకులతో పాటు.. ఇతర అభిమానులకు కూడా కదిలించేసింది. తాను స్వయంగా ఇంట్లోంచి బయటకు వచ్చి కారు ఎక్కేంతవరకూ వెయిట్ చేసి.. కారు కదిలేటప్పుడు చివరిసారి బాయ్..చెప్పి.. ఆత్మీయంగా వీడ్కోలు పలికాడు పవన్ కల్యాణ్.  దటీజ్ అవర్ పవన్..అని అభిమానులు గర్వంగా చెప్పుకునేలా చేశాడు పవన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: