సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం విలన్ మొదట ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు పెళ్లి మాత్రం వేరే అమ్మాయితో చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయినీ తల్లిదండ్రుల్ని  ఓప్పించి పెళ్లి మండపం దాకా తీసకు వస్తాడు. అక్కడే మరో ట్విస్ట్ విలన్ మాజీ ప్రియురాలు పెళ్లి మండపం దగ్గరకు వస్తుంది. విలన్ నిలదీస్తుంది. అంతే కాదు హీరో సహాయంతో విలన్ చితక బాదుతుంది ఇదంతా సినిమాల్లో సర్వసాధారణం మరి ఇలాంటి సీన్ నిజ జీవితంతో జరిగితే.. అవును జరిగింది. 


పెళ్లి మండపం


హరిద్వార్‌లోని ఆవ్డిపుర్హాల్ గ్రామంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతీయువకులు కొద్ది క్షణాల్లో భార్యాభర్తలుగా మారనున్న సమయంలోనే అక్కడికి వరుడి ప్రియురాలు వచ్చింది. ఇక్కడ వరుడిగా ఉన్న వ్యక్తికి తనతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆమె చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. 


 'అతనితో నాకు కోర్టు  ద్వారా గతంలోనే పెళ్లి అయిందని.. చాలా కాలం నుంచి తామిద్దరం 'సహజీవనం'చేస్తున్నామని అక్కడున్న పెద్దలకు స్పష్టం చేసింది.  మరో యువతితో వివాహం చేసుకుంటే తాను పోలీసులను ఆశ్రయించి అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించింది. ఈ సన్నివేశాన్ని కళ్లారా చూసిన  'నవ వధువు' ఆ వరుడు తనకొద్దంటూ పెళ్లిని రిజెక్ట్ చేసింది. ఈ గొడవ అక్కడ పంచాయతీ వరకూ  వెళ్లింది.  పెళ్లి పీఠలపై ఉన్న వధువు తన మనసు మార్చుకుంది. తనకు అతనితో పెళ్లి ఇష్టం లేదని చెప్పిన వధువు, పెళ్లిని రద్దు చేయాల్సిందిగా కోరింది. ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. కాగా, పోలీసుల వద్దకు విషయాన్ని తీసుకుపోకుండా ఇరువర్గాల కుటుంబసభ్యులు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లారు. వధువు.. వరుడి సోదరుడిని వివాహం చేసుకోవాలని పంచాయతీ పెద్దలు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: