ఎన్నో ఆశలు, ఆశయాలు గుండె నిండా పెట్టుకొని కన్నవారికి, దేశానికి ఏదైనా చేయాలని ధృడ సంకల్పంతో ఉన్నత విద్య అభ్యసించాలని విదేశాలకు వెళ్తారు కొంత మంది విద్యార్థులు. కానీ దురదృష్టం వెన్నాడితే ఆశలన్నీ అడియాశలే అయితే కన్నవారికి శోకమే మిగులుతుంది. ఉన్నత చదువుల కోసం సుదూర తీరాలకు వెళ్లి అక్కడ ప్రమాదాల బారిన పడి అప్పడప్పుడు మన తెలుగు పిల్లలు మరణించడం బాద కలిగిస్తుంది.


ప్రమాదానికి గురైన కారు


తాజాగా అమెరికాలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దిలీప్ వర్మ అనే యువకుడు మరణించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం నుంచి చదువు కోసం వెళ్లిన ఈ యువకుడి వయసు 29 ఏళ్లు.ఒక మిత్రుడితో కలిసి కారులో వెళుతుండగా డివైడర్ ను డీకొనడంతో ప్రమాదం జరిగి వర్మ మృతి చెందాడు.ఇతనితో పాటు ఉన్న వ్యక్తి గాయపడగా ఆస్పత్రిలో చేర్చారు.  ఈ ప్రమాదం న్యూజెర్సీలోని హోప్‌వెల్‌లో ఈ ప్రమాదం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: