ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్ వలీ. అనంతపురం వన్టౌన్లో నమోదైన ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం జిల్లాకు వచ్చిన మస్తాన్ వలీ కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వాస్తవానికి గతంలో కమీషన్ కోసం ఎర్రచందనం వ్యాపారం చేసేవాడినని, అది అక్రమంగా తరలిస్తే డబ్బు బాగానే వచ్చేది అని కాకపోతే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో అలాంటి వాటికి స్వస్తి చెప్పానని అన్నారు.
నీతూ అగర్వాల్
ఇప్పడు కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు తను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రేమ ప్రయాణం సినిమా నిర్మాణం సమయంలో హీరోయిన్ నీతూతో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ పరిచయం మా మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నామన్నారు. మేం సహజీవనం చేయడం లేదు వివాహం చేసుకున్నామన్నాడు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం
నీతూకి
ఎర్రచందనం స్మగ్లింగ్తో ఎలాంటి సంబంధం లేదని, తనతో సన్నిహితంగా
ఉంటున్న కారణంగానే ఆమెపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా
ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారంలో సినీనటి నీతూ అగర్వాల్పై కేసు నమోదు చేశామని
కర్నూలు ఎస్పీ ఏ రవికృష్ణ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేయడానికి
ప్రయత్నిస్తున్నామన్నారు.