నాగార్జున.. అందమైన నటుడిగానే మనందరికీ తెలుసు.. అంతకు మించి.. అని ఆలోచిస్తే.. ఆయనో నిర్మాత.. ఇంకా ఆలోచిస్తే..ఆయనో స్టూడియో అధినేత. కానీ ఆయనలో మరిన్ని కోణాలున్నాయి. ఇటీవల ఆయన ఓ అవార్డు అందుకున్నారు. అయితే అది సినీరంగం నుంచి కాకపోవడం ఇక్కడ విశేషం. 


నాగార్జునను బెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రెన్యూయర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ వరించింది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ గ్రాండ్ ఫంక్షన్లో నాగార్జునకు ఈ అవార్డు అందజేశారు. అయితే.. నాగార్జున స్వయంగానే ఓ టీవీఛానల్ యజమాని. ఆయనకు అవార్డు ఇచ్చింది మరో టీవీ ఛానల్ కావడం విశేషం. 


సహజంగా మీడియా యజమానుల మధ్య ఇంతటి సుహృద్భావ వాతావరణం ఉండదు. అందులోనూ అవార్డు ఇచ్చింది వ్యాపార రంగంలో. అందుకే నాగార్జున కూడా మొదటి ఈ అవార్డు ఆఫర్ చేసినప్పుడు ఒప్పుకోలేదట. మరి ఆయన్ను ఒప్పించేందుకు ఆ ఛానల్ ఓ ప్రముఖుడితో పైరవీ చేయించిందట. 


ఆ ప్రముఖుడే తెలంగాణ ఐటీ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్. కేటీఆర్ తో పైరవీ చేయించాక.. నాగార్జున  ఈ అవార్డు తీసుకునేందుకు ఒప్పుకున్నారట. ఈ విషయం కూడా అదే వేదికపై ఛానల్ ప్రతినిధులు బహిరంగంగా చెప్పడం విశేషం. ఇంకో విశేషమేమంటే.. ఈ ఫంక్షన్ లో నాగార్జున కేటీఆర్ పక్కనే కూర్చోవడం.. వీరిద్దరూ పలుసార్లు చెవులు కొరుక్కోవడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: