అదృష్టం తలుపు తట్టి వస్తే.. దురదృష్టం తలుపు తోసుకుని వస్తుందని.. ఓ నానుడి. అయితే ఈ సామెత ఒక్కోసారి రివర్స్ కూడా అవుతుంది. అదృష్టం కూడా ఒక్కోసారి అనుకోకుండా ఒళ్లోవాలిపోయి పరవశింపజేస్తుంది. అకస్మాత్తుగా పలకరించి అవాక్కయ్యేలా చేస్తుంది. 

ఇప్పుడు తెలంగాణకు చెందిన ఓ టీడీపీ నేత విషయంలో ఇదే జరగబోతోంది. పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు ఆయనకు త్వరలో మహారాజయోగం పట్టబోతోంది. ఏకంగా ఆయనకు గవర్నర్ గిరీ దక్కబోతోంది. ఆ నేత ఎవరో కాదు.. మోత్కుపల్లి నర్సింహులు.. 



టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైంది. ఆయన్ను త్వ రలోనే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమిస్తారట. ఈ మేరకు కేంద్రం కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చేసిందట. ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ పదవుల నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమిస్తారట.

గతంలో తనకు పార్టీ పదవులు విషయంలో అనేక సార్లు అన్యాయం జరిగిందన్న ఆవేదన మోత్కుపల్లిలో ఉంది. రాజ్యసభ టిక్కెట్ చాలాసార్లు ఆయన చేతివరకూ వచ్చి జారిపోయింది. ఆ నిరాశలన్నీమరచిపోయేలా ఇప్పుడు ఏకంగా గవర్నర్ పదవే దక్కబోతోందన్నమాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: