సినీ హీరో శివాజీ ఈ మధ్య ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కొన్ని ప్రైవేట్ మీటింగ్ లు పెట్టి వివాదాలకు తెరలేపుతున్నాడు. గతంలో బీజీపీ అగ్ర నేత శివాజీని కాస్త కంట్రోల్ లో ఉండాలని హెచ్చిరించారుకూడా. తాజాగా బీజేపీ శ్రేణుల నుంచి అనుకోని తీవ్ర ప్రతిఘటన ఎదురైంది శివాజీకి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర నేత సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజమండ్రిలో శివాజీ బస చేసిన హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
మీడియా సమావేశంలో శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదాపై సినీ నటుడు శివాజీ, బీజేపీ నాయకులు నేరుగా గొడవలోకి దిగారు. ’బీజేపీ అగ్రనేతలను విమర్శిస్తున్నావు. క్షమాపణ చెప్పు’’ అంటూ శివాజీని బీజేపీ శ్రేణులు నిలదీసే ప్రయత్నం చేయగా, శివాజీ ససేమిరా అన్నారు. ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శివాజీ రాజమండ్రి వచ్చారు.
శివాజీ తీరుపై మండిపడి ధర్నా చేస్తున్న బీజేపీ శ్రేణులు
స్థానిక హోటల్లో
బస చేశారు. విషయం తెలుసుకొన్న బీజేపీ స్థానిక నాయకులు ఆయన బస చేసిన హోటల్ దగ్గరకు
వచ్చారు. అప్పటికే శివాజీ మీడియా సమావేశం పెట్టి ప్రత్యేక హోదా కోసం త్వరలో
గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. కానీ బీజేపీ శ్రేణులు
శివాజీకి గట్టి ఝలక్ ఇచ్చారు.