హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల కోసమే  ముఖ్యమంత్రి కెసిఆర్ జనానికి కలల సినిమా చూపిస్తున్నారని టిడిపి జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. అనేక  సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ కెసిఆర్ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఈ హామీ ఓ రూపం దాల్చలేదు.


 రెండు వేల ఎకరాల్లో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో అపార్ట్ మెంట్లలో  రెండు పడకగదుల ఇళ్లు కట్టించి తీరతామన్నారు నగరం నడిబొడ్డున రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని కెసిఆర్ చెబుతున్నారని, కాని ఇంతకుముందు జెఎన్ యు ఆర్ ఎమ్. కింద ఇరవై కోట్లతో చేపట్టిన ఇళ్లకే దిక్కు లేదని ఆయన మండిపడ్డారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక చోట్ల తాగు నీటి సమస్య ఉంటే దానిని పట్టించుకోవడం లేదు కాని అందమైన కలలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: