ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని దీక్ష తలపెట్టిన హీరో శివాజీపై ఏపీ అగ్ర నేతలు మండిపడుతున్నారు.   శివాజీ పాపులారీటీ కోసమే ప్రత్యేక హోదా పేరుతో ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అసలు శివాజీ ఏ పార్టీలో ఉన్నారో ముందు తేల్చుకోవాలని అన్నారు. అంతే కాదు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రం ఏపీ అభివృద్దికి కృషి చేస్తున్నదని పార్టీలకు అతీతంగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు.  ఈ విషయం పై ఇలా దీక్ష చేయడం వల్ల ఒరిగేది ఏమిలేదని తెలియజేశారు. ఆదివారం నాడు శివాజీ చేపట్టిన దీక్షపై స్పందించిన ఆయన ప్రత్యేక హోదాపై బీజేపీకి ఒక స్టాండ్ ఉందటూ శివాజీ చేపట్టిన దీక్షపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మంత్రి కామినేని శ్రీనివాస్


ఇక పోతే  అసలు అతను బీజేపీకి చెందినవాడు కాడని పురందేశ్వరి వ్యాక్యానించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నటుడు శివాజీ బీజేపీ సభ్యుడు కాదని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. ఆమె ఆదివారం రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివాజీ బీజేపీ సభ్యుడు కాదన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇదివరకే ప్రకటించారని గుర్తుచేశారు. 


మాజీ మంత్రి  పురందేశ్వరి


మరింత సమాచారం తెలుసుకోండి: