కేంద్ర మంత్రి గా బండారు దత్తాత్రేయ నియమించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చురుకుగా పనిచేస్తున్నారు.  ఆదివారం ఉదయమే విమానంలో విశాఖ వచ్చిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. అటునుంచి నేరుగా పోర్టు ప్రాంగణంలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రి సందర్శనకు వెళ్లారు.   ఈ సమయంలో  ఆయన అల్పాహారంలేక సొమ్మసిల్లిపడిపోయిన సంఘటన ఆదివారం విశాఖలో చోటు చేసుకుంది.


పర్యటనలో బాగంగా బండారు దత్తాత్రేయ


చక్కెర వ్యాధిగ్రస్తుడైన దత్తాత్రేయ ఒక్కసారిగా షుగర్‌లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అల్పాహారం ఏర్పాటు చేయాల్సిందిగా తమకు ఎటువంటి సమాచారం లేదని ఇఎస్‌ఐ ఆసుపత్రి అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. జరిగిన సంఘటనపై ప్రోటోకాల్ అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: