ఈ మధ్య అనంత పురం లో వైసీపీ నేతల హత్యలు వరుసగా జరుగుతున్నాయి. వీటిపై జగన్ నోరు విప్పాడు. అనంతపురం జిల్లాలో జరిగిన హత్యలకు సంబందించి డిజిపి రాముడుపై ఎపి శాసనసభ విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జగన్ ఆరోపణలు చేశారు.  తమ పార్టీ ప్రజల్లోకి వెళుతుందని వారి బాగోగులు తెలుసుకొని పాలక పక్షాన్ని నిలదీస్తుందని అందుకే చంద్రబాబు నాయుడు హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలతో డిజిపి సంబంధాలు కలిగి ఉన్నారని, ఆయన సొంత జిల్లా అనంతపురంలోనే హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు.


ఈ మధ్య మరణించిన వైసీపీ లీడర్ ప్రసాద్ రెడ్డి


డీజీపీ రాముడు టీడీపీ మంత్రులతో సన్నిహితంగా ఉంటారని వాళ్లు ఆయనను అన్నా,మామా అంటూ సంబోదిస్తుంటారని ఆయన అన్నారు. రెండు నెలల్లో రిటైర్ కావాల్సిన ఆయనకు రెండు సంవత్సరాల సర్వీస్ పొడిగించారని జగన్ వాపోయారు. డిజిపిని ఉపయోగించుకుని చంద్రబాబు ఈ హత్యలు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు.ఎస్.ఐని వి.ఆర్.కు వేస్తే మరుసటి రోజే తిరిగి పోస్టింగ్ ఇచ్చారని ఆయన అన్నారు. ఈ రాజకీయ హత్యల మీద సిబిఐ తో విచారణ చేయించాలని గవర్నర్ ను కోరామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను,ఆఫీస్ సిబ్బందిని ఉపయోగించి హత్యలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ రాజకీయ హత్యలు ఆపక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: