హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మంచి పేరే ఉంది. టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. హైదరాబాద్ ను మొత్తం నేనే అభివృద్ధి చేశానని కాస్త బడాయి చెప్పుకున్నా..అందులోనూ కాస్త వాస్తవం లేకపోలేదు. అలాంటి హైటెక్ ముఖ్యమంత్రి ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. 

పట్టిసీమ వద్ద సీసీ కెమేరాలు.. 

ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ కెమేరాలను వాడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరిగే ప్రాంతాల్లోనే కాకుండా ప్రతిచోటా సీసీ కెమేరాలను భద్రత కోసం వాడుతున్నారు. చాలా సమయాల్లో ఇవి దోషులను పట్టిస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు వాటిని ప్రాజెక్టుల కోసం వాడుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 

చూస్తున్నా.. అంతా చూస్తున్నా.. 



పట్టిసీమ ప్రాజెక్టును ఎలాగైనా ఏడాదిలో పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు.. ఆ ప్రాజెక్టు పనుల నిరంతర పర్యవేక్షణ కోసం ఆ ప్రాంతంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. పనుల తీరును సచివాలయం నుంచే ప్రతి నిమిషం వీక్షించే సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం పైపులు తయారవుతున్నాయి. అక్కడ సీసీ కెమేరాలు అమర్చడం చర్చనీయాంశమైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: