మనిషి నిరుత్సాహానికి గురైతే ఉన్మాదిగా మారితే ఎంత ఘోరమైన ఉపద్రావలు ముంచుకోస్తాయా చెప్పడం కష్టం.తాజాగా తమిళనాడులోని  మధురై జిల్లా తిరుమంగళంలో దారుణం జరిగింది, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. కట్టుకున్నవాడు తన తో కాపురం చేయడం లేదని చిర్రెత్తుకొచ్చిన ఓ భార్య ఏకంగా అత్తవారింటికి నిప్పు పెట్డడంతో అన్యాయంగా ఏడుగురి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.


గత కొంత కాలం క్రితం నింధితురాలితో బాధితుడికి వివాహం జరిగింది, కొన్నికారణాల వల్ల భార్యను కాపురానికి పిలవకుండా తల్లిగారి ఇంటివద్దనే ఉంచాడు. సహనం కోల్పోయిన ఆ వివాహిత తన అత్తాగారి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో  ఇంటికి నిప్పంటించింది. భర్త, అత్తమామలతో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులు ఈ ఘటనలో సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మతిస్థమితం సరిగా ఉందా లేదా లేక కావాలనే కోపంతో నిప్పంటించిందా అనే తెలుసుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: