భారత దేశం నుంచి అందునా హైదరాబాద్ నుంచి ఇద్దరు క్రీడా కారిణులు అద్భుత ప్రతిభను చూపిస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్తానానికి ఎదుగుతున్నారు. వీరిలో సానియా మిర్జా, సైనా నెహ్వాల్. భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్వన్ ర్యాంకు మళ్లీ దక్కించుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సైనా మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.
కుటుంబ సభ్యులతో సైనా నెహ్వాల్
ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ముందు తిరిగి టాప్ ర్యాంకును దక్కించుకుంది.గత నెల మొదట్లో కెరీర్లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న మొదలయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ ముందు అగ్రస్థానం దక్కించుకోవడం సైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంప్గా బరిలోకి దిగుతున్న సైనా.. తొలి పోరులో క్వాలిఫయర్తో తలపడనుంది.
విజయ దరహాసంతో సైనా నెహ్వాల్
కాగా, తాజా ప్రపంచ ర్యాంకింగ్స్లో మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒక స్థానం దిగజారి 12వ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో మనదేశానికి చెందిన కెశ్రీకాంత్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా, పారుపల్లి కశ్యప్ 13వ ర్యాంక్లోనూ, హెచ్ ఎస్ పామ్నోరు 15వ ర్యాంక్లో ఉన్నారు.