భారత దేశంలో రోజు రోజు కి మహిళల పట్ల అన్యాయాలు, అత్యాచారాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పుడున్న కాలంలో అమ్మాయి ఒంటరిగా ఉంటే అఘాయిత్యాలు జరుగుతాయని ఇదివరకు భయపడేవారు. తల్లిదండ్రలు తమ ఇంటి నుంచి బయలు దేరి అమ్మాయిలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై  నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు.  

హత్య జరిగిన స్థలంలో జాగిలాలతో పోలీసులు


జిల్లాలోని బంట్వారం మండలం బారువాడలో 13 ఏళ్ల బాలికను ఆటోలో వచ్చిన ఐదుగురు దుండగులు బలవంతంగా తీసుకెళ్లి అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. అసలే ఎండాకాలం దాహంగా ఉంది నాన్న అనడంతో పాప తండ్రి మంచినీళ్ల కోసం ఆటో దిగి బయటకు వచ్చాడు. అంతే ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు,  అడ్డగించిన తండ్రిని   తలపై బండరాయితో కొట్టి బాలికను తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.


అనంతరం బాలికను హతమార్చారు. తన కుమార్తెను దుండగులు ఎత్తుకెళ్లారన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్య చేపట్టారు. ఐతే ఆ బాలికపై అత్యాచారం జరిపిన దుండగులు ఆమెను హతమార్చినట్లు కనుగొన్నారు. ఆ ఐదుగురు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: