జూ పార్క్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసి చంపేసింది, ఈ సంఘటన బీహార్‌ని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెరిహండీ గ్రామ సమీపంలోగల వాల్మీకి నేషనల్ పార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పసిపిల్లాడు, న ఎదురుగా ఉన్నది పులో... పిల్లో అని తెలియన చిన్నవయసు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెరిహండీ గ్రామ పరిధిలో చిన్నారి బబ్లూ ఆటలాడుకుంటున్నాడు.


జూ పార్క్ లోని పులి


ఆ క్రమంలో బబ్లూపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. అనంతరం అతడి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చిన్నాభిన్నం చేసింది. దాంతో గ్రామస్తులు, పార మిలటరీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే వాల్మీకి నేషనల్ పార్క్లో పులుల సంఖ్య గత మూడేళ్ల కాలవ్యవధిలో రెండింతలు అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్క్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం మృతి చెందిన బబ్లూ కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందజేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: